కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
దిగజారి వ్యవహరిస్తారా..!
23 Jul 2015 8:50 PM
హైదరాబాద్ ) రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి వ్యవహరిస్తోందని మాజీమంత్రి ధర్మాన ప్రసాద్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతోమాట్లాడారు. ఇసుక మాఫియా కేసులో ప్రభుత్వం తరపున వ్యవహరించిన తహశీల్దార్ వనజాక్షిని క్యాబినెట్ తప్పు పట్టడాన్ని ఆయన ఖండించారు. ఏ విధంగా ఆమెది తప్పని నిర్ణయిస్తారని ఆయన అన్నారు. అసలు ఈ వ్యవహారంలో దర్యాప్తు జరగకుండానే ఈ విధమైన నిర్ణయం ఎలా తీసుకొంటారని ధర్మాన అన్నారు. చంద్రబాబు పాలన రోజు రోజుకి దిగజారి పోతోందని ఆయన అభిప్రాయ పడ్డారు. అనుభవజ్జుడ్ని అని చెప్పుకొని పదవిలోకి వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు దిగజారిపోయి వ్యవహరిస్తున్నారని ధర్మాన విమర్శించారు.
----------------