సీఎం కిరణ్‌ అసమర్థుడు- అందుకే ఈ దుస్థితి

కర్నూలు :

బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యున‌ల్ తీర్పుతో తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఏడారిగా మా‌రిపోతాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. అసమర్ధ సీఎం, నిలదీయలేని ప్రతిపక్ష నేత ఉండటం వల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి ఏర్పడిందని ఆమె మండిపడ్డారు. ట్రిబ్యునల్ తీర్పుతో తెలంగాణ, రాయలసీమ ఏడారిగా మారే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేలుకోవాలని ఆమె సూచించారు. ట్రిబ్యునల్పై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి‌ శోభా నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్, సాగునీటి కష్టాలు మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి. కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజే‌శ్‌కుమార్ ట్రిబ్యున‌ల్ తుది తీర్పు కూడా ఆంధ్రప్రదే‌శ్ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే ఉండే అవకాశ‌ం ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ ట్రిబ్యునల్ తీర్పు ఆంద్రప్రదే‌శ్‌కు వ్యతిరేకంగా ఉంటే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఎడారిగా మారే అవకాశం ఉందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Back to Top