హైదరాబాద్: బ్రిటీష్ హై కమిషనర్ డామినిక్ స్క్విత్ వైయస్ఆర్సీసీ నేతలు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రిటీష్ హైకమిషనర్ బృందం హైదరాబాద్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలను కలుసుకుంది. <br/><br/>ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక పరిస్థితులు, భవిష్యత్లో వ్యాపార అవకాశాలు, కొత్త రాజధాని తదితర అంశాలపై బ్రిటీష్ బృందం చర్చించింది. ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులను బ్రిటీష్ బృందానికి వివరించినట్టు బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.