బాబు దివాళాకోరు రాజకీయాలు

విజయవాడ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించకుండా మంత్రి పదవలు ఇచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పార్థసారథి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా విజయవాడలోని ధర్నా చౌక్‌లో  వైయస్సార్పీసీ ఆధ్వర్యంలో సేవ్‌ డెమోక్రసీ కార్యక్రమం చేపట్టారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని పార్థసారధి అన్నారు. రాజ్యంగంపై గౌరవం ఉంటే పార్టీ మారిన నేతలతో రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఆందోళనలకు వామపక్షాలు సైతం తమ మద్దతు ప్రకటించి ధర్నాలో పాల్గొన్నాయి.

Back to Top