రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
‘అవిశ్వాసానికి’ మద్దతివ్వలేదేం: మైసూరా
18 Apr 2013 11:00 AM
హైదరాబాద్: టైమ్సు నౌ చానల్ సర్వేపై టిడిని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అంత ధీమా ఉంటే.. ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు ఓటు వేయలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి. మైసూరారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగితే టిడిపికి పుట్టగతులు ఉండవనే విషయం చంద్రబాబుకు బాగా తెలుసన్నారు. అందుకే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వకుండా పారిపోయారని విమర్శించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ‘టైమ్సు నౌ’ సర్వే ప్రజలు నమ్మేదిగా లేదన్నారు. ఆ సర్వేకు శాస్త్రీయత పూర్తిగా లోపించిందని, ఇష్టానుసారంగా అంకెలు వేశారని, దీన్ని చూస్తేనే నవ్వొస్తోందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30కి పైగా లోక్సభ స్థానాలు ఖాయంగా గెలుచుకుంటుందని మైసూరా ధీమాగా చెప్పారు.