తుని ఘటనకు తెలుగుదేశం, చంద్రబాబుదే బాధ్యత

() కాపు రిజర్వేషన్
డిమాండ్లతో తునిలో చోటు చేసుకొన్న ఘటనలపై వైఎస్సార్సీపీ స్పందించింది. ఉద్యమాలు
శాంతి యుతంగా జరగాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అభిలషించారు.
ఉద్యమంలో సంఘ విద్రోహకర శక్తులు చొరబడ్డాయని, ఇటువంటి పోకడల్ని గమనించాలని ఉద్యమ
నేతలకు రాంబాబు సూచించారు. కానీ, ఇంతటి పరిస్థితికి చంద్రబాబు, తెలుగుదేశం బాధ్యత
వహించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

          ఏ ఉద్యమం అయినా శాంతియుతంగా ముందుకు వెళ్లాలని వైఎస్సార్సీపీ
కోరుకొంటుంది. ఘటనల తీరు మీద మేం బాధ పడుతున్నాం. ఇటువంటి పోకడల్ని మేం
ఖండిస్తున్నాం. ఉద్యమకారుల్లోకి సంఘ విద్రోహకర శక్తులు చొరబడ్డాయని, తగు
జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యమనాయకులకు అంబటి రాంబాబు సూచించారు. ఇంతటి పరిస్థితి
చోటు చేసుకొంటే టీడీపీ నాయకులు ఏమని మాట్లాడతున్నారో చూస్తున్నాం. అన్నింటికీ
వైఎస్ జగన్ దే బాధ్యత అంటున్నారు. ఇది ఎంతటి అన్యాయం అని అంబటి రాంబాబు
ప్రశ్నించారు.

          ఎన్నికల సమయంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఐదుసంవత్సరాల పాటు
ఖర్చు పెడతామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు, అది కూడా ముద్రగడ కాపు గర్జన కు పిలుపు
ఇచ్చాక..రూ. 100 కోట్లతో హడావుడిగా కార్పొరేషన్ ఏర్పాటుచేశారని అంబటి రాంబాబు
గుర్తుచేశారు. పైగా ఈ సమావేశానికి ముందు కూడా చంద్రబాబు.. ఈ సభకు ఎవ్వరూ
వెళ్లకూడదు, కాపుల్ని రెచ్చ గొడుతున్నారు అని చెప్పి సభను అడ్డుకొనేందుకు
ప్రయత్నించారని అంబటి అన్నారు.

          దీనికి ముఖ్య కారణం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి,
తప్పించుకొని తిరుగుతుండటమే కారణమని అంబటి అంటున్నారు. కానీ, ఏది జరిగినా వైఎస్
జగన్ మీద అభాండాలు వేయటమే తెలుగుదేశానికి తెలిసిన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.
పట్టిసీమ విషయంలోనూ, రాజధాని అవకతవకల విషయంలోనూ అదే జరిగిందని అంబటి అభిప్రాయ
పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరించి కాపుల్ని ఆదుకోవాలని
విన్నవించారు. 

Back to Top