చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అలిపిరిలో 1,116 కొబ్బరికాయలు కొట్టిన భూమన
04 Oct 2012 5:22 AM
తిరుపతి, 4 అక్టోబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి న్యాయం జరగాలని కోరుతూ పార్టీకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో 1,116 కొబ్బరికాయలు కొట్టారు. అలిపిరిలోని శ్రీవారి పాదాల వద్ద పార్టీ శ్రేణులు, వైయస్ అభిమానులు గురువారం నాడు ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమం కోసం కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటికి వస్తారని అన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు సీబీఐని పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు కూడబలుక్కుని, కుట్ర చేసి ఏ తప్పూ చేయని జగన్ను జైలు పాలు చేశాయని ఆయన నిప్పులు చెరిగారు. ఎప్పటికీ న్యాయమే గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.