టీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం
అభిరుచి మధును అరెస్టు చేయాలి
24 Aug 2017 4:02 PM
కర్నూలు: శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులకు పాల్పడిన టీడీపీ నేత అభిరుచి మధును వెంటనే అరెస్టు చేయాలని నందికొట్కూరు, ఆదోని ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. నంద్యాల ఘటనను వారు ఖండించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా టీడీపీ నేతల చేతుల్లోకి ఆయుధాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఎలాంటి ప్రజాప్రతినిధి కాని రౌడీసీటర్ మధుకు గన్మెన్లను ఎందుకు కేటాయించారని నిలదీశారు. గుండాలు, రౌడీలు పట్టపగలే కత్తులతో తిరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. హత్యారాజకీయాలు మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధికార పార్టీ నేతలు ఇంతలా వీరంగం సృష్టించడం ఎప్పుడు చూడలేదన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. కత్తులతో వీరంగం చేయడం ఏంటని ప్రశ్నించారు.