రేపు వైయ‌స్ జ‌గ‌న్ విజ‌య‌వాడ ప‌ర్య‌ట‌న‌

వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో పాల్గొన‌నున్న మాజీ ముఖ్య‌మంత్రి 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (27.08.2025)  విజయవాడ లో ప‌ర్య‌టించ‌నున్నారు. వినాయకచవితి సందర్భంగా విజయవాడ రాణీగారి తోటలో జరిగే గణనాధుని పూజా కార్యక్రమంలో  వైయస్‌ జగన్ పాల్గొన‌నున్నారు. ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ రాణీగారి తోట (దేవుళ్ళ ఆంజనేయులు స్ట్రీట్‌, శాంపిల్‌ బిల్డింగ్‌) వద్ద జరగనున్న గణనాధుని పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి బయలుదేరుతారు.

Back to Top