అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతోనే టీటీడీలో సన్నిధి యాదవులకు వారసత్వ హక్కు వచ్చిందని ఎమ్మెల్యే పార్థసారధి పేర్కొన్నారు. ఈ హక్కు కల్పించిన సీఎం వైయస్ జగన్కు యాదవుల తరఫున పార్థసారధి కృతజ్ఞతలు తెలిపారు. చట్టంలో సన్నిధి యాదవులని మార్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.