హింసను ప్రేరేపించేందుకు చంద్రబాబు కుట్ర

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
 

గుంటూరు: రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. దాడి వెనుక టీడీపీ హస్తం ఉందన్నారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలను పంపించి దాడికి పాల్పడ్డారన్నారు. రైతుల ముసుగులో దాడి చేయడం పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు.

Back to Top