పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ బుధవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులు, పోలవరం స్థితిగతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.