అమరావతి: కరోనా విపత్తులోనూ పేదలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం జూన్లో అమలు చేసే నవరత్నాల పథకాల తేదీలను ఖరారు చేసింది. వైయస్సార్ చేయూత, వైయస్సార్ వాహన మిత్ర, జగనన్న తోడు పథకాలను వచ్చే నెలలో అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఏ తేదీన ఏ పథకం అమలు చేయనుందో ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. జూన్ 8న జగనన్న తోడు జూన్ 15న వైయస్ఆర్ వాహన మిత్ర జూన్ 22న వైయస్ఆర్ చేయూత