అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ఏపీలో 38 మంది కోవిడ్ పేషెంట్లు డిశ్చార్జ్
02 May 2020 12:18 PM
మరో 62 పాజిటివ్ కేసులు
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1525
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకు కరోనా వైరస్ తగ్గుతోంది. శనివారం రాష్ట్రంలో 38 మంది కోవిడ్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో 5943 నమూనాలను పరీక్షించగా.. 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1525 కు చేరుకుందని తెలిపింది. కోవిడ్ బాధితుల్లో తాజాగా 38 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 441 కు చేరుకుందని పేర్కొంది. వైరస్ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 33 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో ఎంటువంటి కోవిడ్ మరణాలు సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1051 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది.