తాడేపల్లి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎం టీ కృష్ణబాబు, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, చీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ ఎం గిరిజాశంకర్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ( కోవిడ్ –19) కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్ రెడ్డి, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.