మరో 20 ఏళ్లు వైయస్‌ జగనే సీఎం

 సినీ నటుడు భానుచందర్‌

శ్రీకాకుళం: ప్రజల కోసం తపించే వైయస్‌ జగన్‌ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని సినీనటుడు భానుచందర్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో జరుగుతున్న ప్రజా సంకల్పయాత్ర ముగింపులో ఆయన పాల్గొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌కు ఎవరూ సాటి లేరని, ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. జనంతో ఇంత ఇంట్రాక్ట్‌ అయ్యే నాయకుడిని నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదని భానుచందర్‌ అన్నారు. 2019 నుంచి మరో 20 సంవత్సరాల వరకు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్నారు. 

 

Back to Top