తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (01.03.2024) కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించనున్నారు. జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామర్రు చేరుకుంటారు, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి, జగనన్న విద్యా దీవెన – బటన్ నొక్కి నగదు జమ చేయనున్న ముఖ్యమంత్రి, అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.