గుంటూరు: అయ్యా.. పేరుకే రాజధానిలో బతుకుతున్నాం. ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా అందించలేకపోతోంది’ అంటూ నవులూరు రాజీవ్నగర్ కాలనీ వాసులు జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతం నుంచి తాగునీటి కోసం మంగళగిరి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. వీధిలైట్లు, రోడ్లు కూడా లేవంటూ పద్మప్రియ వివరించారు.