పింగళి వెంకయ్యకు వైయ‌స్‌ జగన్‌ నివాళి 

తాడేప‌ల్లి: పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ‘‘జాతీయ జెండా రూపకర్త, తెలుగు జాతి ముద్దు బిడ్డ పింగళి వెంకయ్య గారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన భారతదేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను’’ అని వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top