ప్రతి కొత్త సంవత్సరం లాగే ఈ సారి కూడా తన విధాన నిర్ణయాల్ని చంద్రబాబు ప్రకటించాడు. కొత్త సంవత్సరానికి ఒక యాక్షన్ ప్లాన్ తయారుచేసుకొన్నారు.<br/>(1) ఎప్పటిలాగే ఈ సారి కూడా ప్రజల్ని మాయ చేయాలి.అవసరమైతే నేపాళ మాంత్రికున్ని పిలిపించి శిక్షణ తీసుకోవాలి. తిమ్మిని బమ్మి చేయడం పాతపద్ధతి, తిమ్మిని మాయం చేయడం కొత్త పద్ధతి.(2) రైతులకి వూరట కలిగించడానికి నదులన్నీ అనుసంధానం చేయాలి. ఉత్తరాంధ్రలో వున్న నాగావళిని, రాయలసీమలో వున్న పెన్నానదిని కలిపి చరిత్రలో నిలిచిపోవాలి. గతంలో గోదావరి నుంచి చెంబుడు నీళ్లు క్రిష్నాలో పోసి అనుసంధానం అయిపోయిందని, పచ్చ మీడియాలో రాయించుకొన్నాను కాబట్టి ఈ సారి అయిదుచెంబులునీళ్లు ఉపయోగిస్తాను. మన జేబులు నిండే పనుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి.(3)సముద్రం పొడుగునా పరిశ్రమలు పెట్టాలి. జాలర్లకు వలలు ఫ్రీగా ఇస్తామని చెప్పి వాళ్ల ఊళ్లను లాక్కొనే ప్రయత్నం చేయాలి.(4)ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ సింగపూర్ని నిర్మిస్తాం. ఇకపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని నిర్మూలించి ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారుతుంది.(5)వచ్చే ఎన్నికల వరకూ అమరావతిని కడుతూ వుంటాం. అప్పటి అమరావతి ఇంద్రుడి రాజధాని అయితే ఇప్పటి అమరావతి చంద్రుడి రాజధాని, ఖజానా ఖాళీ చేసి ప్రజలకు చిప్పచేతికిచ్చయినా సరే అమరావతిని అబ్బురపరిచేలా నిర్మిస్తాం. దివాళాతీసిన ప్రజలకు వూరి బయట అడుక్కునే కాలనీలు నిర్మించి పునరావాసం కల్పిస్తాం(6)రాయలసీమలోని ప్రతివూళ్ళో 3 డి ఎఫెక్ట్ లో డ్రీమ్ ఫ్యాక్టరీని కడతాం. వాస్తవం చేదుగా వున్న ప్రజలు ఈ ఫ్యాక్టరీలో కలలు కనేలా అన్ని ఏర్పాట్లు చేస్తాం.(7)రాష్ట్రమంతా 8 లేన్ల రోడ్లు వేసి లక్షలాది మందిని రోడ్డున పడేస్తాం. రోడ్లు నాగరితని సూచిస్తాయి. విదేశాల నుంచి వచ్చిన అతిధులకు రోడ్లు చూపిస్తాం కానీ రోడ్ సైడ్ బెగ్గర్లను కాదు.(8)మంత్రులతో కలిసి వీలైనన్ని ఎక్కువ దేశాలు తిరిగి అభివృద్ధిపై అధ్యయనం చేస్తాం. అభివృద్ధి అంటే సొంత అభివృద్ధే తప్ప రాష్ట్ర అభివృద్ధి కాదు(9)అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి పక్ష ఎమ్మేల్యేని వచ్చే ఎన్నికల వరకూ సస్పెండ్ చేస్తాం(10)జనం అన్నీ మరిచిపోయేలా ప్రతి వంద మీటర్లలో బెల్ట్ షాప్ని పెట్టి నిద్రపుచ్చుతాం.