22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
జయహో బీసీ సభకి భారీగా తరలివెళ్లిన వైయస్ఆర్సీపీ శ్రేణులు
06 Dec 2022 1:00 PM
అనంతపురం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో రేపు జరుగుతున్న జయహో బిసి సభలో పాల్గొనేందుకు ఉరవకొండ నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఉరవకొండ పట్టణ, వివిధ మండలాల కన్వీనర్లు,రాష్ట్ర డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ ప్రజాప్రతినిధుల ఆద్వర్యంలో వివిధ వాహనాల్లో సుమారు 1500 మంది విజయవాడ బీసీ సభకి వెళ్లారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా పలువురు బిసి నేతలు మాట్లాడుతూ.. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు నడిపించేందుకు సీఎం కృషిచేస్తున్నారన్నారు. ప్రత్యేకంగా 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి, చైర్మన్, డైరెక్టర్ పదవులు ఇచ్చారన్నారు. అదే విధంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారని వారు చెప్పారు. బీసీల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాటుపడుతున్నారని చెప్పారు. బీసీలను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంక్గానే వాడుకున్నారని మండిపడ్డారు.