తాడేపల్లి: వైయస్ఆర్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాటలను వక్రీకరించి టీడీపీ, ఎల్లోమీడియా వివాదాన్ని పెద్దది చేయడం దారుణమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శివశంకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వీడియో. ఇందులో వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పై విషప్రచారం చేస్తూ మొదలుపెట్టిన కుట్రను వివరించారు. కొమ్మినేని అక్రమ అరెస్టును ఖండిస్తూ, ఈ అక్రమ అరెస్టు, సాక్షి కార్యాలయాలపై దాడుల వెనుక ఉన్న కుట్రను ప్రజలకు వివరిస్తూ వైయస్ఆర్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ మీడియా ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సాక్షి టీవీలో డిబేటు ఆరో తేదీన జరిగితే, అది జరిగిన 24 గంటల తర్వాత ఉద్దేశ పూర్వకంగా వైయస్ఆర్సీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ చేసిన తప్పడు ప్రచారం వెనుక ఒక పథకం ఉందని, కోఆర్డినేటెడ్గా, రాజకీయ దురుద్దేశంతో, నిరసనల పేరుతో టీడీపీ కార్యకర్తలు తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా, సభ్యత మరిచి, వ్యక్తిత్వ హననం చేస్తూ శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డిగారి కుటుంబాన్ని, ఆయన భార్య భారతిరెడ్డిగారిని వినలేని భాషలో అసభ్యంగా దూషించారని సజ్జల తన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ప్రణాళికను రచించి, అమలు చేసిన రాజకీయ ఉన్మాదులను చర్యలను ఖండిస్తూ సజ్జల తన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆమాటలను ఎల్లోమీడియా, నారా లోకేష్ మళ్లీ వక్రీకరిస్తూ ఆ వ్యాఖ్యలను మహిళలకు ఆపాదించి, సజ్జల మహిళలనుద్దేశించి తప్పుడు ప్రచారం చేసినట్టుగా విషప్రచారం మొదలుపెట్టి మరో కుట్రకు తెరలేపారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి.. ఆ అంశానికి సజ్జలగారి ప్రెస్కాన్ఫరెన్స్ పూర్తి వీడియోను, దాంతోపాటు మూడు నిమిషాల ఈ వీడియోను కూడా పోస్టు చేస్తున్నాం గమనించగలరు. పాలనా వైఫల్యాలనుంచి, మహిళలు, బాలికలపై నేరాలు, ఘోరాలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి లోకేష్, ఎల్లోమీడియాలు చీప్ ట్రిక్స్ ప్రయోగించడాన్ని ఖండిస్తున్నాం.