ఐటీ సోదాలపై నోరు విప్పడం లేదేం బాబూ..?

అమరావతి: ఎప్పుడూ తప్పుడు మాటలతో వార్తల్లో నిలిచే చంద్రబాబు ఆయన సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నా సైలెంట్‌గా ఉన్నారెందుకని.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు ప్రశ్నించారు. చంద్రబాబుపై ట్విట్టర్‌ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మాజీ పీఏతో పాటు తాను పెంచి పోషించిన అవినీతి సర్పాలపై జరుగుతున్న ఐటీ సోదాలపై చంద్రబాబు నోరువిప్పడం లేదు. నిప్పు కణికల్లాంటి వారిపై ఈ దాడులేంటని ఐటీ శాఖను నిలదీయాలి. రెండ్రోజులుగా కిక్కురుమనకుండా, కియా లేచిపోతోందని ఫేక్‌ వార్తలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నాడు’అని పేర్కొన్నారు. 
 

Back to Top