విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు

దీక్షా శిబిరాన్ని సంద‌ర్శించిన ఎంపీ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌

  విశాఖపట్నం:  విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య‌మానికి వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తోంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షా శిబిరానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ బుధవారం సందర్శించారు. కార్మికుల ఉద్యమానికి ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ.. '' స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైయ‌స్సార్‌సీపీ అండగా ఉంది. సీఎం వైయ‌స్ జగన్ ఇప్పటికే రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తాం' అని ఎంపీ తెలిపారు.

Back to Top