చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రజలంతా సీఎం వైయస్ జగన్ వెంటే..
15 Feb 2021 6:20 PM
మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం: ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా ప్రజలంతా నిలబడ్డారని, అందుకు పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో సుమారు 101 స్థానాలకు గానూ 73 మంది వైయస్ఆర్ సీపీ మద్దతుదారులు విజయం సాధించారన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న సీఎం వైయస్ జగన్కు ప్రజలంతా మద్దతుగా నిలిచారన్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల కంటే పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైయస్ఆర్ సీపీ విజయం సాధిస్తుందన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డులను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో ట్యాక్స్లు అదనంగా వసూలు చేసేవారని, వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ట్యాక్స్లు తగ్గించామని చెప్పారు.