తిరుమల: పాక్ ఉగ్రవాదుల చర్యను దేశమంతా ఖండిస్తుంటే చంద్రబాబు మాత్రం సమర్థిస్తున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. పుల్వామా ఘటనకు బాధ్యతగా మోదీ రాజీనామా చేయాలని చంద్రబాబు అన్నారని, పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార ఆర్భాటానికి 36 మంది బలయ్యారని..మరి చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.చంద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును కొట్టి చంపారన్నారు.వైయస్ జగన్ ప్రజాబలాన్ని చూసి వైయస్ఆర్సీపీలోకి వలస వస్తున్నారన్నారు.పార్టీలోకి వచ్చిన ప్రతిఒక్కరూ పదవులకు రాజీనామా చేసి వస్తున్నారన్నారు.దళితులపై చింతమనేని వ్యాఖ్యలు చంద్రబాబు తీరుకు నిదర్శనమన్నారు. తిరుమల స్థానికుల సమస్యలను టీటీడీ వెంటనే పరిష్కరించాలన్నారు. దళితుల గురించి ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబు తీరును బయటపెడుతున్నాయని ఎమ్మెల్యే రోజా అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ వారిని చంద్రబాబు గతంలో అవమానించారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆయనను అనుసరిస్తున్నారంటూ విమర్శించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా బలాన్ని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి వలస వస్తున్నారని అన్నారు. అలా వచ్చే ప్రతీ ఒక్కరు తమ పదవులకు రాజీనామా చేయడం వైఎస్ జగన్ నైతికతకు నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం వైఎస్సార్ సీపీ నుంచి కొన్న వారి చేత రాజీనామా చేయించకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. తనకు ఓ నీతి.. ఇంకొకరికి వేరే నీతి పుల్వామా ఉగ్రదాడిని దేశమంతా ఖండిస్తుంటే.. సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఘటనను ఎందుకు సమర్థిస్తున్నారంటూ రోజా మండిపడ్డారు గతంలో గోదావరి పుష్కరాలలో చంద్రబాబు చేసిన పబ్లిసిటీ స్టంట్ కారణంగా 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదుల చర్యకు ఇప్పుడు ప్రధాని మోదీని రాజీనామా చేయమంటున్న బాబు... ఆనాడు 30 మంది ప్రాణాలు బలిగొని తానెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు మీటింగ్ కోసం ఓ రైతును దారుణంగా కొట్టి చంపారని..(కోటయ్య మృతి.. ఈ ప్రశ్నలకు బదులేది?) కనీసం ఇప్పుడైనా ఎందుకు రాజీనామా చేయడం లేదని ధ్వజమెత్తారు. ద్వంద్వ విధానాలు ఉన్న చంద్రబాబుకు తనకో నీతి.. మరొకరికి వేరే నీతి అన్నట్టుగా వ్యవహరించడం అలవాటేనని ఎద్దేవా చేశారు.