మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
ఎందుకు ఇంత రాద్ధాంతం
19 Jan 2019 5:28 PM
వైయస్ఆర్ సీపీ నాయకులు మార్గాని భరత్
పశ్చిమగోదావరి : పదవుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ను కలిసినప్పుడు ఏం మాట్లాడనివారు.. ఇప్పుడు కేటీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిస్తే మాత్రం ఎందుకు ఇంత రాద్ధంతం చేస్తున్నారంటూ వైయస్ఆర్ సీపీ నాయకులు మార్గాని భరత్ ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైయస్ జగన్ - కేటీఆర్ కలయిక గురించి తెలుగుదేశం నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని స్వాగతించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి అన్యాయం చేశాయని ఆరోపించారు. ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరుగుతుంటే.. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కలిసి పోరాటం చేయడమే ఫెడరల్ ఫ్రంట్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అందులో భాగంగానే కేటీఆర్, జగన్ను కలిశారన్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం నాయకులు పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.