ముచ్చర్లలో వంద శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం

మాజీ మంత్రి గుడివాడ‌ అమర్నాథ్ స్ప‌ష్టం
 

విశాఖపట్నం: టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిప‌డ్డారు. పట్టాలు ఇస్తాం, ఆధార్‌ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముచ్చర్లలో వైయ‌స్ఆర్‌సీపీ బ‌లంగా ఉంద‌ని, అక్క‌డ‌ నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం అన్న‌ది పెద్ద అబద్దమ‌ని కొట్టిపారేశారు. శ‌నివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో మీడియాతో మాట్లాడారు.

‘టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.   భీమిలి నియోజకవర్గంలోని ముచ్చర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ముచ్చర్లలో 1400 మంది ఓటర్లు టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ముచ్చర్లలో నూటికి నూరు శాతం టీడీపీ సభ్యత్వం పెద్ద అబద్దం. లేనిది ఉన్నట్టు సృష్టించి టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తోంది.

విశాఖలోని ముచ్చర్లలో వైయ‌స్ఆర్‌సీపీ బలంగా ఉంది. పట్టాలు ఇప్పిస్తాం, ఆధార్‌ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్‌లు తీసుకుని టీడీపీ సభ్యత్వమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. 600 ఎకరాల భూమిని కొట్టేయడానికి లోకల్‌ టీడీపీ నేత కుట్ర పన్నారు. రాష్ట్రంలో బడ్డీ కొట్టు వ్యాపారుల దగ్గర నుంచి రియల్‌ ఎస్టేట్‌ వరకు కూటమి నేతలు దోచుకుంటున్నారు’ అని కామెంట్స్‌ చేశారు.  

అమ‌ర్నాథ్ ఇంకా ఏమ‌న్నారంటే..

  • ముచ్చెర్ల గ్రామంలో వందకు వంద శాతం టిడిపి సభ్యత్వం నమోదు అనేది పచ్చి అబద్ధం
  • గ్రామంలో 1400 మంది ప్రజలు టిడిపి సభ్యత్వం తీసుకున్నట్లు వార్తలు రాస్తున్నారు..
  • లేనిది ఉన్నట్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని లోకేష్ చూస్తున్నారు..
  • సభ్యత్వం పై లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
  • ముచ్చెర్ల గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ బలంగా ఉంది.
  • ముచ్చెర్ల గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీతో జనసేన బిజెపి పార్టీలు లేవా..
  • ముచ్చర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వైయ‌స్ఆర్‌సీపీ గెలుసుకుంది.
  • ఎమ్మెల్యే ఎన్నికల్లో 1350 ఓట్లుకు గాను టీడీపీకి వైయ‌స్ఆర్‌సీపీ 150 ఓట్లు మాత్రమే తేడా ఉంది..
  • భీమిలీలో వైయ‌స్ఆర్‌సీపీకి బలమైన క్యాడర్ ఉంది.
  • సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి టిడిపి నేతలు ప్రజలు ఆధార్ కార్డులు తీసుకొని టిడిపి సభ్యత్వం నమోదు చేస్తున్నారు..
  • 100 శాతం సభ్యత్వం జరిగిందని లోకేష్ ముచ్చెర్ల గ్రామానికి ఎలా వస్తారు..
  • సభ్యత్వంపై తప్పుడు లెక్కలు చెప్పడం మంచి పద్ధతి కాదు..
  • కొన్ని చోట్ల బెదిరించి సభ్యత్వం నమోదు చేస్తున్నారు
  • పక్క రాష్ట్రాల వారికి సభ్యత్వం చేస్తున్నారు..
  • ముచ్చెర్ల గ్రామంలో 600 ఎకరాల భూమిని టిడిపి నాయకులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా సభ్యత్వంపై దొంగ లెక్కలు చెబుతున్నారు.
  • గత ఏడు నెలల ప్రవచనాలు చెపుతున్న అనితా గురించి టిడిపి గెజిట్ పేపర్ ఈనాడు లో వచ్చింది.
  • టీటీడీ లెటర్ అమ్ముకునే స్థితికి హోం మంత్రి అనిత పేషి చేరుకుంది..
  • సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు టీటీడీ లెటర్ గురించి ఏమీ చెపుతారు..
  • టీటీడీ లడ్డు గురించి రాద్ధాంతం చేసిన నేతలు ఏమి సమాధానం చెపుతారు..
  • మంత్రులు నెల వారీగా వసూళ్లు చేస్తున్నారు..
  •  
Back to Top