అక్టోబరు 1 నుంచి వైయస్ఆర్ కళ్యాణమస్తు.. షాదీ తోఫా

 ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన వైయస్‌.జగన్‌

 హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు 

అమరావతి:  పేద ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుభ‌వార్త చెప్పారు. పాద‌యాత్ర, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఇప్ప‌టికే 95 శాతం అమ‌లు చేయ‌గా మ‌రో రెండు కొత్త ప‌థ‌కాల అమ‌లుకు కార్యాచ‌ర‌ణ సిద్ధం చేశారు. మేనిఫెస్టోలో మరో కీలక హామీని వైయ‌స్ జ‌గ‌న్ నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేస్తున్నారు. అక్టోబరు 1 నుంచి వైయస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి జీవో జారీ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ఈ ప‌థ‌కాలు వర్తింపు చేస్తాయి. పేద ఆడపిల్ల కుటుంబాలకు సర్కారు బాసటగా నిలుస్తూ..గౌరవ ప్రదంగా వివాహం జరిపించేందుకు ఈ ప‌థ‌కాలు తోడ్ప‌డుతాయి. ప్ర‌భుత్వ నిర్ణ‌యంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి. 

  • కళ్యాణమస్తు, షాదీ తోఫాల కింద గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు
  • ఎస్సీలకు వైయస్ఆర్  కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు
  • ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు 
  • ఎస్టీలకు రూ. 1 లక్ష
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు
  • బీసీలకు  రూ. 50వేలు
  • బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు
  • మైనార్టీలకు రూ. 1 లక్ష
  • వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు
  • భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు 
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.44 శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి  
  • మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌లా అత్యంత పవిత్రంగా భావిస్తామన్న చూస్తామన్న వైయస్‌.జగన్‌
  • ఇచ్చిన మాట మేరకు హామీలు అమలు 
  • దేశ రాజకీయాల్లో మేనిఫెస్టోకు విశ్వసనీయత అద్దిన వైయస్‌.జగన్‌
  • రాజకీయాల్లో అంకిత భావానికి, నిబద్ధతకు ప్రతిరూపంగా నిలిచిన వైనం
  • గత ప్రభుత్వంలో కాగితాలకే పరిమితమైన పథకం
  • చంద్రబాబు హయాంలో ఆర్భాటం జాస్తి... అమలు నాస్తి..
  • గత ప్రభుత్వంలో పథకం ఉన్నా కాగితాలకే పరిమితం
  • అన్నివర్గాలకూ లభించని పెళ్లికానుక
  • 2017లో బీసీలను పథకంలో చేర్చిన నాటి ప్రభుత్వం
  • అయినా వారికి పెళ్లికానుక అందని వైనం
  • 2018–19 నాటికి 17,709   ఎగ్గొట్టిన చంద్రబాబు
  • పెండింగ్‌లో పెట్టి వారికి నయాపైసా ఇవ్వని గత ప్రభుత్వం
  • రూ. 68.68 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు సర్కారు
  • నాటి మార్గదర్శకాల్లో కూడా సమగ్రత లేదు
  • లబ్ధిదారులకు ఇవ్వాలన్న కోణంలో కాకుండా, ఎలా ఎగ్గొట్టాలన్న కోణంలో నియమాలు, నిబంధనలు
  • అర్హులందరికీ వర్తించేలా పథకాన్ని తీర్చిదిద్దిన వైయస్‌.జగన్‌ సర్కార్‌
  • గత ప్రభుత్వం ప్రకటించిన దానికంటే అధికంగా నగదు
  • ఎస్సీలకు వైయస్సార్‌ కళ్యాణమస్తు కింద రూ. 1లక్ష రూపాయలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 40వేలు
  • ఎస్సీల కులాంత వివాహాలకు రూ. 1.2 లక్షలు, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది రూ.75వేలు 
  • ఎస్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
  • ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.2 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 75వేలు
  • బీసీలకు  రూ. 50వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.35వేలు
  • బీసీలు– కులాంత వివాహాలకు రూ.75వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 50వేలు
  • మైనార్టీలకు రూ. 1 లక్ష, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.50వేలు
  • వికలాంగుల వివాహాలకు రూ. 1.5 లక్షలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ. 1లక్ష మాత్రమే. 
  • భవన నిర్మాణకార్మికులకు రూ.40వేలు, గతంలో చంద్రబాబు ప్రకటించింది రూ.20వేలే
  • అమ్మాయి వయస్సు 18, అబ్బాయి వయస్సు 21 సంవత్సరాలనిబంధన 
  • అర్హతలను జీవోలో పొందుపరిచిన ప్రభుత్వం
  • పథకానికి సంబంధించి పూర్తిగా వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి
  • గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పథకం నిర్వహణ
Back to Top