నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
జనరంజక పాలనతో వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం జైత్రయాత్ర
02 Jan 2023 2:24 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి
తాడేపల్లి: అనేక రాజకీయ, ఆర్థిక సవాళ్లు విజయవంతంగా ఎదుర్కొని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వలోని రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికర రీతిలో నూతన సంవత్సరంలోకి ప్రవేశించిందని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరంజక పాలనకు మూడున్నరేళ్లు దాటిందన్నారు. 2019మే ఆఖరులో అనేక ప్రజాసంక్షేమ పథకాలతో అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్ సర్కారు తన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజల్లో నవచైతన్యాన్ని నింపిందన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో నలిగిపోయిన ప్రజలకు చెప్పలేనంత ఊరట కల్పించిందని వివరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడున్నరేళ్ల పరిపాలన పూర్తిచేసుకొని, నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక స్టోరీని పోస్టు చేశారు.
``ఈ మూడున్నరేళ్లలో తెలుగుదేశం పార్టీ దుందుడుకు వైఖరి వల్ల అక్కడక్కడా రాజకీయ గొడవలు జరిగినా అవి వెంటనే సద్దుమణుగేలా ప్రభుత్వం సకాలంలో చర్యలు తీసుకుంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైయస్ఆర్ సీపీ సర్కారు పాలనపై ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నా నవ్యాంధ్రలో ఆయన పాలనలో లేని శాంతి భద్రతలు ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నాయి. నిరంతరం జనామోదంతో ప్రజల మనస్సుల్లో పాలకపక్షం పాతుకుపోవడం చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోయి మతిలేని మాటలు మాట్లాడుతున్నారు. కిందటేడాది చివరి మాసాల్లో ఆయన ‘2024లో జరిగేవి నాకు చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి. నన్ను మీరు గెలిపించి అధికారం అప్పగించకపోతే’–అనే రీతిలో చంద్రబాబు చాలాసార్లు మాట్లాడారు. ముఖ్యమంత్రి అయ్యే చివరి అవకాశం తనకు ఇవ్వాలని, అలా ఇవ్వకపోతే రాష్ట్రానికే అవి తుది ఎన్నికలవుతాయని ప్రజలను భయపట్టే ప్రయత్నం చేశారు బాబు. అలాగే, టీడీపీ నీరసించిపోయిన కారణంగా– అన్ని పార్టీలు కలిస్తే తప్ప వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టిగా ఢీకొనలేమనే కొత్త థియరీని ఆయన రంగం మీదకు తీసుకొచ్చారు. ప్రస్తుత పాలకపక్షం ‘ఓడిపోతే’ ఈ పార్టీ అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను తాను కొనసాగిస్తానంటూ నారా వారు అబద్ధాలు అవలీలగా జనం మీదకు విసురుతున్నారు.
2022 సంవత్సరం తెలుగు ప్రజలకు పరీక్షా సమయంలా గడిచింది. ఈ పరీక్షలో వైయస్ఆర్ కాంగ్రెస్ విజయవంతంగా నిలిచింది. ప్రధాన ప్రతిపక్షానికి దాని స్థానమేంటో చూపించింది. సరిగ్గా ఏడాది నాలుగు నెలల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల గురించి మరీ మితిమీరి ఆలోచించకుండా జన సంక్షేమమే ఏకైక ధ్యేయంగా ముందుకు సాగుతోంది వైయస్ జగన్ ప్రభుత్వం. ‘రాష్ట్రాన్ని కాపాడుతా నన్ను గెలిపిస్తే’ అంటూ చంద్రబాబు తన జిత్తులమారి మాటలతో జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఫలించవని ఇకనైనా తెలుసుకుంటే మంచిది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన విలువ తెలుసుకున్న ఆంధ్ర ప్రజానీకం– ఏడాది తర్వాత మరో ఐదేళ్ల జనరంజక పాలనకు అవకాశం ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. 2023లో కూడా గత మూడున్నరేళ్ల సుపరిపాలన మరింత విజయవంతంగా సాగుతుందన్న ప్రజల అంచనాలు, ఆశలు తప్పక నిజమవుతాయి.``