తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో చిన్నారి ఆద్విక్కు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నప్రాసన చేశారు. తూర్పుగోదావరి జిల్లా డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ సాక మణికుమారి, సాక ప్రసన్నకుమార్ (జెడ్పీ మాజీ ప్రతిపక్షనేత) తమ మనవడు చిన్నారి ఆద్విక్కు అన్నప్రాసన చేయాలని కోరగా.. వైయస్ జగన్ను కోరడంతో వారి ముచ్చట తీరుస్తూ చిన్నారికి అన్నప్రాసన చేసి ఎత్తుకొని ముద్దాడాడు. దీంతో మణికుమారి దంపతులు, ఆద్విక్ తల్లిదండ్రులు డాక్టర్ శృతి, ప్రేమ్కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.