పవన్‌.. దమ్ముంటే వారిద్దర్నీ తొక్కిపెట్టి నార తీయాలి

మాజీ మంత్రి ఆర్కే రోజా
 

తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్‌పై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. 
మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్‌ సిక్స్‌ హామీలను గాలికొదిలేశారు. పాలనను పక్కన పడేసి దాడులు, అరాచకాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ను ప్రజలు ఓడించలేదు.. ఈవీఎంల గోల్‌మాల్‌తో ఓడించారు. వైఎస్‌ జగన్‌ సభలకు జనం రాకుండా చేయాలనేది ప్రభుత్వ కుట్ర. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలి. ఈవీఎంలతో గెలిచామన్న అహంకారం వారి మాటల్లో కనిపిస్తుంది. మహిళల అక్రమ రవాణాపై పవన్‌ ఎందుకు మాట్లాడటం లేదు?. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్‌ కల్యాణ్‌. మరి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా’ అని ప్రశ్నించారు. 

Back to Top