ముఖ్య‌మంత్రిని క‌లిసిన టీటీడీ చైర్మ‌న్‌

భువ‌నేశ్వ‌ర్‌లో శ్రీ‌వారి దేవ‌స్థానం ప్రారంభోత్స‌వ ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేత‌

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో నూత‌నంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవ ఆహ్వాన‌ప‌త్రిక‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేశారు. ఈ నెల 21నుంచి విగ్రహ ప్రతిష్ఠ‌కు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 26న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహా సంప్రోక్షణ, ఆవాహన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జ‌ర‌గ‌నున్నాయి. ఆహ్వాన‌ప‌త్రిక అంద‌జేసిన వారిలో టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డితో పాటు టీటీడీ డిప్యూటీ ఈవో గుణభూషణ రెడ్డి, ఏఈవో దొరస్వామి ఉన్నారు.అంద‌జేసిన 

Back to Top