కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలి
30 Mar 2021 5:45 PM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
శ్రీకాళహస్తిలో వైయస్ఆర్సీపీ నేతల ఎన్నికల ప్రచారం
చిత్తూరు: తిరుపతి ఉప ఎన్నికలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం. గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్ వినిపించాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శ్రీ కాళహస్తీ లో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఎంపీ అభ్యర్థి గురుమూర్తి తరఫున వైయస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా ఇన్చార్జ్, టీటీడీ చైర్మన్ వై. వి. సుబ్బారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కన్నబాబు, ఎమ్మెల్యేలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే 4.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్దేనన్నారు. కుల, మత, పార్టీలకతీతంగా గురుమూర్తికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..చిత్తూరు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. గండికోట నుంచి గాలేరుకు నగరి జలాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. పైప్లైన్ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆమోదం తెలిపారన్నారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే 90 శాతం హామీలు నెరవేర్చామని పెద్దిరెడ్డి చెప్పారు.
మంత్రి కన్నబాబు మాట్లాడుతూ..సామాన్యులను పార్లమెంట్కు పంపించిన ఘనత సీఎం వైయస్ జగన్దన్నారు. మాధవి, నందిగం సురేష్లాగానే గురుమూర్తి కూడా పార్లమెంట్కు వెళ్తారని కన్నబాబు ధీమా వ్యక్తం చేశారు.