200 ఆక్సిజ‌న్‌ కాన్సంట్రేట‌ర్లు అంద‌జేసిన సిక్మా ప్ర‌తినిధులు

తాడేప‌ల్లి: కోవిడ్‌–19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విలువైన 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల‌ను సౌత్‌ ఇండియన్‌ సిమెంట్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సిక్మా) ప్రతినిధులు అంద‌జేశారు. ఈ మేర‌కు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని అసోసియేష‌న్ ప్ర‌తినిధులు ఎం.రవీందర్‌ రెడ్డి (డైరెక్టర్, మార్కెటింగ్, భారతీ సిమెంట్స్‌), డాక్టర్‌ ఎస్‌.ఆనంద్‌ రెడ్డి (ఎండీ, సాగర్‌ సిమెంట్స్‌), ఇంజేటి గోపినాద్‌ (సీఈవో, సిక్మా) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లసి వివ‌రాలు అంద‌జేశారు. ఒక్కొక్కటి 10 లీటర్ల కెపాసిటీ ఉన్న 200 కాన్సంట్రేటర్ల‌ విరాళంగా అందజేశారు. 

Back to Top