భారీ ఎత్తున తరలివచ్చిన అశేష జనవాహిని స్వాగత హర్ష ధ్వానాల మధ్య శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో వైయస్సార్ సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా సాగింది. నియోజకవర్గ పరిధిలోని జరిగిన పలు అభివృద్ధి పనులను బస్సు యాత్ర ద్వారా నేతలు పరిశీలించి లబ్ధిదారులతో ముచ్చటించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల వైయస్సార్ సిపి రీజనల్ కోర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ లు హాజరయ్యారు. అనంతరం జరిగిన ఆముదాలవలస జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. పట్టణంలోని అన్ని రహదారులు జనంతో కిక్కిరిసి పోయాయి. సభకు పోటెత్తిన జన సందోహానికి మంత్రి సీదిరి అప్పలరాజు అభివాదం చేస్తూ జై జగన్... జై జగన్ అంటూ నినదించి పాట పాడి ఉత్సాహ పరిచారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి జగన్ రుణం తీర్చుకోవాలి - స్పీకర్ తమ్మినేని పిలుపు ఈ సందర్భంగా సభలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని గత ప్రభుత్వం పేదలను,బడుగు బలహీన వర్గాలను పట్టించుకోలేదనే ప్రజలు తిరిగబడి జగన్ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. కారు చీకట్లో కాంతి రేఖగా జగన్ ని ప్రజలు గుర్తించి ముఖ్యమంత్రిని చేసారని కొనియాడారు. ప్రజల ఆశల ను, ఆశయాలను సాకారం చేసినందునే సాధికార యాత్రకు జనం ఎగబడుతున్నారన్నారు.. తన వల్ల మంచి జరిగితేనే తనకు ఓటు వేయ్యాలని లేకుంటే వద్దని సీఎం జగన్ అడుగగలుగుతున్నారని సీతారామ్ వ్యాఖ్యానించారు పెత్తందారీ వ్యవస్థలో బానిసలుగా ఉన్న బడుగులకు విముక్తిని కలిగించేందుకు జగన్ పోరాడుతున్నారు. చేయూతనిచ్చిన నేత జగన్ ను చేజార్చుకుంటామా అని ప్రజలను ప్రశ్నించారు. ఈవాళ అభివృద్ధి కోసం టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని, అభివృద్ధి అంటే ఆర్థికంగా, సామాజికంగా , సమతుల్యంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో సీఎంగా జగన్ ను గెలిపించుకోవాలి, 37 పథకాలు పెట్టి ప్రజలకు జగన్ బటన్ నొక్కి నిధులు నేరుగా జమ చేస్తున్నారని, ఐదేళ్ల తర్వాత మనం ఒకే ఒక్క సారి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి జగన్ రుణం తీర్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇచ్చిన మాట మీద నిలబడే సీఎం జగన్ ఒక్కరే - మంత్రి ధర్మాన రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రజలకు జవాబుదారీగా దేశంలో పాలన సాగించిన ఘనత సీఎం జగన్ దేనని కొనియాడారు. 75 ఏళ్ల తర్వాత సామాజిక అంతరాలు, ప్రజల జీవన స్థితిగతులు నిర్లిప్తంగా పడి ఉంటే, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాజిక సాధికారత దిశగా అడుగులు వేసారన్నారు. దేశంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని వెల్లడించారు. ఉద్దానంలో ప్రతిపక్ష నేతలు వచ్చి కన్నీరు కార్చి డ్రామాలాడారని, జగన్ వచ్చి పరిశోధనల నివేదిక మేరకు పరిశుద్ధమైన నీరు అందించే పథకానికి రూ. 800 కోట్లు తో శ్రీకారం చుట్టారన్నారు. ఈ బృహత్తర ప్రాజెక్టును 23న సీఎం జగన్ ప్రారంభించనున్నారన్నారు. విశాఖను రాజధాని చేస్తానంటే టీడీపీ నేతలు ఎందుకు వొద్దంటున్నారో చెప్పాలని, ఇక్కడ వ్యాపారాలు చేసుకుని హైదారాబాద్ లో ఉండేవారు మాత్రమే అడ్డుకుంటున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని విషయంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రజలతో సంబంధం లేకుండా చంద్రబాబు తన మనుషులతో కలసి నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు, రాజధానిగా విశాఖ కంటే అర్హత కలిగిన మరో నగరం ఏదైనా ఉందా అని ధర్మాన చంద్రబాబును ప్రశ్నించారు. మన సంక్షేమం కోసం పాటుపడే వైయస్సార్ సిపి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీ రామ్మోహన్ రాజకీయాలు మానేసి బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలి - మంత్రి సీదిరి పశుసంర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ, జగన్ సీఎం కాక ముందు ప్రజల జీవన పరిస్థితులు అత్యంత అధ్వాన్నంగా ఉండేవని, ఆ దారుణ స్థితిగతులను సమూలంగా మార్చివేసి విద్యా, వైద్యా రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అప్పలరాజు గుర్తు చేసారు. బీసీలను అడుగడునా అవమానించిన చంద్రబాబు ఎక్కడ.... రాజ్యాధికారం ఇచ్చి అన్ని అవకాశాలు కల్పించి బిసి,ఎస్సి,ఎస్టి, మైనారిటీల ఆత్మగౌరవాన్ని నిలిపిన సీఎం జగన్ ఎక్కడో ప్రజలు ఆలోచించాలన్నారు.. ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు వచ్చి సంక్షేమ పాలన చేస్తుంటే ఓర్వలేక శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. రైల్వే స్టేషన్ లో స్టీల్ కుర్చీలు వేయడం తప్పితే శ్రీకాకుళం జిల్లాకు ఏమి చేసారో చెప్పాలని డిమాండ్ చేసారు. రామ్మోహన్ నాయాడు రాజకీయాలకు రాజీనామా చేసి బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని అప్పలరాజు ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం జిల్లా యువత వలస పోకుండా ఉండేందుకు సీఎం జగన్ స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించేలా పోర్టు నిర్మాణం చేస్తున్నారని గుర్తు చేసారు. నేరేడు బ్యారేజ్ పూర్తయితే రైతంగానికి సాగునీరు అందుతుందని భావించి ఒడిశా ముఖ్యమంత్రిని సీఎం జగన్ కలసి పరిష్కారానికి కృషి చేసిన విషయాన్ని గుర్తు చేసారు. ఆముదాలవలస గడ్డ,, వైఎస్సార్ సీపీ అడ్డా అంటూ అప్పలరాజు ప్రజలతో కలసి నినదించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడంతో పాటుగా సంక్షేమానికి కూడా ప్రాధాన్యతగా తీసుకుని పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ కీర్తి పొందారన్నారు. ఆముదాలవలస నుంచి గెలిచిన తమ్మినేని సీతారామ్ కు సీఎం జగన్ స్పీకర్ గా ఎంతో ప్రాధాన్యతను ఇచ్చి అధ్యక్షా అని పిలుచుకునే అవకాశాన్ని కల్పించారని గుర్తు చేసారు. టీడీపీకి దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించాలని, టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలతో కలసి వచ్చినా సరే సాధించేదేమీ ఉండదన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో తొమ్మింటికి ఎనిమిది స్థానాలు గెలవగా, ఈసారి అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు. ప్రభుత్వ సలహాదారులు జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ, నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబుకు వచ్చిన స్వేచ్ఛ రాజకీయ అధికారాన్ని దుర్వినియోగం చేసారన్నారు.. ఇంగ్లీషు మీడియాన్ని అమలులోకి తీసుకువచ్చి బడుగుల పిల్లల ఉజ్వల భవితకు జగన్ బాటలు వేసారన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, మహిళలకు అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తూ ప్రతీ కుటుంబంలో కీలకంగా అండే అవకాశం కల్పించారన్నారు. అన్ని వర్గాలకు గౌరవం ఇచ్చినా జగన్ ను మళ్లీ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని గుర్తు చేసారు