కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కరోనా నియంత్రణపై సమీక్షా సమావేశం ప్రారంభం
01 Apr 2020 12:52 PM
పింఛన్ పంపిణీ, ఆస్పత్రుల్లో బెడ్లు, వైద్య సదుపాయాలపై చర్చ
తాడేపల్లి: కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, సీఎస్ నీలం సాహ్నిం, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో పెన్షన్ పంపిణీ జరుగుతున్న తీరు, ఆస్పత్రుల్లో కరోనా నియంత్రణకు ఏర్పాటు చేసిన బెడ్లు, వైద్య సదుపాయాలు, ల్యాబ్ టెస్టింగ్ రిపోర్టులపై సీఎం వైయస్ జగన్ అధికారులతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా రెండో విడత ఇంటింటి సర్వేపై సీఎం సమీక్షించనున్నారు.