మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం

రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి
 
 సేవా కార్యక్రమాలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తురాలు వైయ‌స్ భారతి
 
డీఎల్ మ‌తిస్థిమితం కోల్పోయి సీఎం వైయ‌స్ జగన్ పై విమర్శలు  

అన్నమయ్య జిల్లా:  సీఎం వైయ‌స్ జగన్ కుటుంబ స‌భ్యుల‌పై మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిప‌డ్డారు.  డీఎల్ రవీంద్రా రెడ్డి కి పదవీ రాకపోవడంతోనే వైయ‌స్ జగన్ సతీమణి భారతి పై అసత్య ఆరోపణలు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దివంగత నేత వైయ‌స్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్న మహోన్నతమైన వ్యక్తురాలు వైయ‌స్ భారతి…డీఎల్ రవీంద్రా రెడ్డి రాజకీయంగా మాట్లాడొచ్చు.. వ్యక్తిగత విషయాలు అనవసరమ‌న్నారు. అభివృధ్ధి పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నామ‌ని స‌వాలు విసిరారు.   
సిఎం సతీమణి గా ఎంతో మందికి సేవ చేస్తోంది..పత్రికలు, మీడియా ద్వారా పబ్లిసిటీ కోసం డీ ఎల్ మాట్లాడుతున్నారు..మేం మాట్లాడాలనుకుంటే చాలా చెబుతాం..వైయ‌స్ జగన్ మాకు నేర్పించిన సంస్కారం అడ్డు వస్తోంద‌ని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. మతిస్థిమితం కోల్పోయి సీఎం వైయ‌స్ జగన్ పై విమర్శలు చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.  డిఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవి రావడానికి కారణం వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి అన్న విషయం కూడా మర్చిపోయి డి ఎల్ మాట్లాడుతున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. డిఎల్ రవీంద్రారెడ్డి సీఎం వైయ‌స్‌ జగన్ కుటుంబం పై మాట్లాడిన తీరు చూస్తే ఆయనకు మతిస్థిమితం భ్రమించింద‌ని అర్థ‌మ‌వుతుంద‌న్నారు. మంత్రి పదవి నుండి రెండు సార్లు బర్తరఫ్ అయిన వ్యక్తి సీఎం వైయ‌స్ జగన్ గురించి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

Back to Top