రైళ్లలో అపరిశ్రుభమైన బెడ్‌రోల్స్‌ సరఫరా చేస్తున్నారు

రాజ్యసభలో రైల్వే ప్రయాణికుల సమస్యలను ప్రస్తావించిన ఎంపీ విజయసాయిరెడ్డి
 

న్యూఢిల్లీః రైల్వే ప్రయాణికుల సమస్యలను వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు.రైళ్లలో అపరిశ్రుభమైన బెడ్‌రోల్స్‌ సరఫరా చేస్తున్నారని ఏపీ సరిగా ఉండటం లేదని ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.విశాఖపట్నం, తిరుపతి,చెన్నై,బెంగుళూరు వెళ్ళే రైళ్లల్లో తరుచూ ఈ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.ఏపీ ఎక్స్‌ప్రెస్,కోరమండల్,ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ల్లో సరిగా ఏసీ సదుపాయం ఉండటం లేదన్నారు.రైల్వేశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు.రైళ్లలో క్లీన్‌ బెడ్‌రోల్స్,అంతరాయం లేకుండా ఏసీ సరఫరా చేయాలన్నారు.కనీస ప్రాథమిక సౌకర్యాలను పరిశుభ్రంగా కల్పించాలని కోరారు. 

 

తాజా వీడియోలు

Back to Top