అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?
అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవు
06 Oct 2022 4:30 PM
పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
అమరావతి: అటవీ భూములపై కన్నేస్తే.. కఠిన చర్యలు తప్పవని పర్యావరణ, అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సర్వే ద్వారా కబ్జాదారులను గుర్తిస్తామని.. ఆక్రమణకు గురైన భూములను తిరిగి అటవీ శాఖకు బదలాయిస్తామని అన్నారు. కబ్జాదారులు ఎవరైనా సరే.. విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అటవీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అటవీభూముల సంరక్షణపై ప్రత్యేక్ష దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో వివాదాస్పదంగా ఉన్న 10 వేల ఎకరాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని చెప్పారు. అటవీ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే కొనసాగుతోందని.. కబ్జాకు గురైన అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.