మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ను కలిసిన నూతన వైస్ చాన్స్లర్లు
22 Feb 2023 3:02 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఇటీవల నూతనంగా నియమితులైన పలు యూనివర్శిటీల వైస్ చాన్స్లర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. వీసీలుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిశారు. కడప డాక్టర్ వైయస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ వీసీగా నియమితులైన బానోత్ ఆంజనేయ ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్టీయూ) గురజాడ, విజయనగరం వీసీ కే.వెంకట సుబ్బయ్య, ఆంధ్రకేసరి యూనివర్శిటీ ఒంగోలు వీసీ మారెడ్డి అంజిరెడ్డిలు సీఎంను కలిశారు. సమావేశంలో ఉన్నతవిద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి పాల్గొన్నారు.