పోరుమామిళ్ల‌లో ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారం

వైయ‌స్ఆర్ జిల్లా: బద్వేలు ఉప ఎన్నికలో భాగంగా పోరుమామిళ్ల మండలంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి , క‌డ‌ప ర‌త్నాక‌ర్ త‌దిత‌రులు ఇంటింటికి ప్రచారం నిర్వ‌హించారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థిని డాక్ట‌ర్ సుధ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్య‌ధిక మెజారిటీతో గెలిపించాల‌ని అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. దళిత వర్గాల అభ్యున్నతికి సీఎం వైయ‌స్ జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. దళితులు ఉన్నత చదువులు చదవాలని ప్రత్యేక పథకాలు తెచ్చారన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా?. రోజుకు ఒకసారి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు పెంచుతున్నారు. విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. ఆదినారాయణరెడ్డి దళితులను అవహేళన చేస్తూ మాట్లాడారు. వైయ‌స్సార్‌సీపీ నుంచి గెలిచి మంత్రి పదవి కోసం టీడీపీలో చేరాడు. ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని’’ ఎంపీ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top