విశాఖ: ఏపీలో ఆఫీసులు మూసెయ్యడంతో పక్క రాష్ట్రంలో పుట్టిన రోజు జరుపుకుంటున్న 420కి జన్మదిన శుభాకాంక్షలు అంటూ వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పైగా కరోనా వల్ల బర్త్ డే ఘనంగా చెయ్యవద్దంటూ సందేశం.17 తర్వాత 'పార్టీ లేదు బొక్కాలేదన్న సందేశాన్ని' ఇప్పటికే మీవాళ్లు పాటిస్తున్నారులే బాబు. మళ్ళీ నీ 'బ్రీఫ్ డు అవసరం లేదు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా బాబూ? సింహాచలం దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎక్కువ మందిని గంటా సతీమణి చౌదరి మేడం నియమించారట! చంద్రబాబూ నీ పార్టీ దిగజారడానికి ఇక మెట్లు లేవు. 2 ఛానళ్లు, 2 పేపర్లలో చూసుకుని మురిసిపోవడమే. రాష్ట్రంలో ఇంకా పచ్చ పార్టీ ఉందనే భ్రమ కల్పించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా బాబూ? అంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.