కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడ్డారు..
03 Mar 2020 11:31 AM
దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ప్రతిపక్ష టీడీపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశం కల్పించాలని సీఎం భావిస్తే టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డు పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల పై టీడీపీ కి ఉన్న ప్రేమ ఏపాటిదో బట్టబయలు అయిందని చెప్పారు. బీసీలను టీడీపీ ఓటుబ్యాంకుగానే చూసిందని.. వారి అభివృద్ధికి పాటు పడలేదని పేర్కొన్నారు. బీసీల ఎదుగుదలను ఓర్చుకోలేక నారా లోకేష్ అనుచరులు అడ్డుపడటమే అందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 44 నాలుగు లక్షల మందికి పెన్షన్ లు ఇస్తే సీఎం జగన్ 60 లక్షల మందికి అందిస్తున్నారని పేర్కొన్నారు. పదహారు లక్షల మందికి కొత్తగా పెన్షన్ లు ఇస్తుంటే ఉన్నవి తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు గ్లోబల్ ప్రచారం చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సీఎం వైయస్ జగన్ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను మంత్రి వెల్లంపల్లి హెచ్చరించారు.