కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బ్రహ్మంగారి మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా అందలేదు
13 Jun 2021 1:42 PM
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: బ్రహ్మంగారి మఠాధిపతులుగా 11 మంది పనిచేశారని.. మఠాధిపత్యంపై ఎలాంటి వీలునామా తమకు అందలేదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన బ్రహ్మంగారి మఠం వివాదంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సమాలోచనలు జరిపారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం 90 రోజుల్లో వీలునామా అందించాలని.. వీలునామా అందనందున ధార్మిక పరిషత్ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
మఠం నిర్వహణకు తాత్కాలిక అధికారిని నియమించామని ఆయన చెప్పారు. మఠం ఆచారాలు, సంప్రదాయాలను త్వరితగతిన సేకరిస్తామని పేర్కొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చని సూచించారు. బ్రహ్మంగారి పీఠాధిపతి ఎంపిక సాంప్రదాయబద్ధంగా జరుగుతుందని మంత్రి వెల్లంపల్లి వెల్లడించారు.