సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదు
జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ సేవలు నిలిపివేత
21 Mar 2020 12:47 PM
రవాణా శాఖ మంత్రి పేర్ని నాని
విజయవాడ: జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఆర్టీసీ సేవలను నిలిపివేస్తున్నామని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆర్టీసీ బంద్ కొనసాగుతుందన్నారు. ప్రధాన మంతి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఆర్టీసీ సేవలను రేపు నిలిపివేస్తున్నామన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఈ రోజు నుంచే నిలిపివేస్తున్నామని వివరించారు. ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. ఇదే అదునుగా భావించి టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేసే ప్రైవేట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దయచేసి జనతా కర్ఫ్యూకి అందరూ సహకరించాలని పేర్ని నాని కోరారు.