‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఒక పార్టీకి, కులానికి మేలు చేసేలా నిమ్మగడ్డ వైఖరి
09 Jan 2021 2:33 PM
ప్రజల ఆరోగ్యం ఎస్ఈసీకి పట్టదా..?
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
తిరుపతి: చంద్రబాబు డైరెక్షన్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ నడుచుకుంటున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కరోనా కేసులు తక్కువ ఉన్న సమయంలో చంద్రబాబు మాటలు విని స్థానిక సంస్థలు ఎన్నికలు వాయిదా వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ.. కోవిడ్ సేకండ్ వేవ్ ఉన్న సమయంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నిమ్మగడ్డ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఒక వ్యక్తికి, ఒక కులానికి, ఒక పార్టీకి మేలు చేసేలా నిమ్మగడ్డ నిర్ణయాలు ఉన్నాయన్నారు. ప్రజల ఆరోగ్యం ఎస్ఈసీకి పట్టదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం చేయలేదనేది అందరికీ తెలుసన్నారు.