మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ను విమర్శించే అర్హత పవన్కు లేదు
13 Jan 2023 1:20 PM
వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత పవన్ కళ్యాణ్కు లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నవరత్నాల పథకాలు అర్హులందరికీ అందుతున్నాయి. అన్ని వర్గాలు ఆత్మగౌరవంతో ఉండేలా సీఎం వైయస్ జగన్ పాలన ఉందన్నారు. కిడ్నీ బాధితుల కోసం పలాసలోనే ఆసుపత్రి ఏర్పాటు చేస్తున్నామని, బాధితుల చికిత్స కోసం కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి అనేది మా ప్రభుత్వం నిర్ణయం అన్నారు. పెట్టుబడులన్నీ అమరావతిలోనే పెడతామంటే మిగతా ప్రాంతాలు ఒప్పుకోవు. అమరావతిలో రాజధాని అనేది కొద్ది మంది రియల్టర్ల కోసమేనని తెలిపారు. శ్రీకాకుళం వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం ఇంకెన్నాళ్లు నష్టపోవాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఏం చేయాలో పవన్ సూచించాలన్నారు. ఉత్తరాంధ్ర బాగుపడటం పవన్కు ఇష్టం లేదా? అని నిలదీశారు. పవన్ మాటలకు చేతలకు పొంతన లేదని ధ్వజమెత్తారు. మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే విమర్శిస్తారా అని దుయ్యబట్టారు. విశాఖ రాజధాని వద్దని కొద్ది మంది రియల్టర్ల వైపున ఉంటారా. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాం. అలాంటి తప్పు మళ్లీ జరగకూడదనే వికేంద్రీకరణ నిర్ణయం సీఎం వైయస్ జగన్ తీసుకున్నారని తెలిపారు. విశాఖపట్నం రాజధానితో మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయ వ్యాపారవేత్త చంద్రబాబుకు పవన్ కల్యాణ్ మద్దతా..?
పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కొందరి మహానుభావుల పేర్లు చెబుతున్నారు. శ్రీశ్రీ, వంగపండు, గిడుగు రామ్మూర్తి పంతులు, చాగంటి సోమయాజులు తదితరుల పేర్లు ప్రస్తావించారు. గొప్ప భావజాలాలు స్థిరీకరించి చదువుతున్న ఇటువంటి వ్యక్తులు ఎంత నిదానంగా ఎంత లక్ష్యంతో ఉంటారు. మీరు ఓ వైపు ఆ పుస్తకాలు చదివాను అంటున్నారు కానీ గొప్ప భావజాలాన్ని ఒంటపట్టించుకున్న విధంగా మాట్లాడడం లేదు. శ్రీశ్రీ ఏం చెప్పారు. పతితులారా భ్రష్టులారా బాధా సర్ప ద్రష్టులారా ఏడవకండి ఏడవకండి..అని చెప్పారు. కన్నీళ్లతో నలిగిపోయిన వ్యథార్థుల గురించి శ్రీశ్రీ చెప్పిన మాటలివి. మీరు వీటిని స్టడీ చేశారంటున్నారు. జగన్ గారు అమలు చేస్తున్న పథకాలు, ఆయన ఆలోచనలు వల్ల సంక్షేమం-అభివృద్ధి ఫలాలు ఎవరికి చేరుతున్నాయో చూడండి. ఎగ్జాట్లీ శ్రీశ్రీ చెప్పిన విధంగా బాధా తప్త హృదయాలతో ఉన్న వారికి సంక్షేమ ఫలాలు గౌరవంగా అందించే పని జగన్ గారు చేస్తున్నారు. మీరు ఆయన్ను విమర్శిస్తు న్నారు. ఆయన పథకాలను విమర్శిస్తున్నారు. ఆ పుస్తకాలు చదివితే ఆ భావ జాలం ఏంటి ఇలాంటి లక్ష్యాలు చేరుకునేందుకు ఎలా ఉండాలి కానీ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విధంగా అనిపిస్తుంది. వంగపండు గారు..ఆయన కూడా చైతన్యం రగిలించే పాటలు అందించారు. మరి ఆ పాటలను పాడుతూ ఇక్కడ ఉన్న వారిని అజ్ఞానానికి ప్రేరేపించిన విధంగా మాట్లాడు తున్నారు. ఓ రాజకీయ పార్టీని నడిపే వారు సహనం కోల్పోయి వ్యాఖ్యలు చేయడం తగదు. శ్రీశ్రీ గారు చెప్పినట్టు అట్టడుగు వర్గాలకు.. సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న పథకాలు.. వారి గడప వద్దకే గౌరవంగా చేరుతున్నాయి. సీఎం జగన్ను విమర్శించే అర్హత పవన్కు లేదు - అన్ని వర్గాల వారు గౌరవంగా బతికేలా.. సీఎం జగన్ గారి పరిపాలన ఉంది. పవన్ కల్యాణ్ .. శ్రీశ్రీ డైలాగులు చెబుతూ.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన, తెహల్కా డాట్ కామ్ చెప్పినట్టు, అత్యంత అవినీతిపరుడు, పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ముకాసే దొంగల పార్టీకి, చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సబబు..?
ఉద్దానంలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఎందుకు చెప్పరు?
ఇంతకుముందు ఉద్దానం వెళ్లారు. కొన్ని విషయాలు చెప్పారు. మరి జగన్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారో చెప్పగలిగారా ? . భేష్ ఒక్క మంచి పని గురించి అయినా మీరు చెప్పగలిగారా ? .
పుస్తకాలకు చెందిన భావజాలానికి అనుగుణంగా కాకుండా అందుకు భిన్నంగా మాట్లాడిన విధంగా కనిపిస్తోంది మీ వ్యవహారం. ఉద్దానం గురించి గతంలో ప్రతి రోజూ వచ్చే వార్తలు ఇప్పుడు వస్తున్నాయా . ఉపరితల జలాలు వంశధార నుంచి వారికి అందేవిధంగా రూ.800 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. అదేవిధంగా అప్పటివరకు, వారికి ఆర్థిక సాయం కూడా అందిస్తున్నాం. వారి చికిత్స కోసం పలాసలో సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి వస్తుంది. మధ్యలో ఓ ప్రభుత్వం వచ్చింది. వారేం చేశారు?
శివరామకృష్ణన్ నివేదిక చదివారా..?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విడపోక ముందు కేంద్రం ఓ కమిటీని నియమించింది. శ్రీ కృష్ణ కమిషన్ ఏం చెప్పింది అన్నది మీరు ఎన్నడయినా చదివారా ? క్యాపిటల్ గురించి శివ రామ కృష్ణ కమిషన్ నివేదికను మీరు స్టడీ చేశారా ? ఏ కాంటెక్ట్స్లో రాష్ట్రం ఇమ్మన్నాను అంటే, 65 సంవత్సరాలపాటు ఓ ప్రాంత ప్రజల నోరు నొక్కి, ప్రభుత్వ ధనాన్ని అంతా ఒకచోటనే కేటాయించి అభివృద్ధి చేస్తే, ఆ విధంగా చేసి కట్టు బట్టలతో రావాల్సి వచ్చింది. మళ్లీ అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేనే కాదు, శ్రీ కృష్ణ కమిటీ కానీ, శివ రామకృష్ణ కమిషన్ కానీ అదే చెబుతున్నాయి. డీ సెంట్రలైజేషన్ గురించి చెబుతోంది.
మా ప్రాంతం వచ్చి అమరావతి అంటారా?
అమరావతి కోసం మీరు పాటుపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెబుతున్నారు. అది వద్దు పరిపాలన వికేంద్రీకరణ గురించి నా అభిప్రాయం చెప్పాను. ఇదే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పాలన రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించింది. మా ప్రాంతం వచ్చి, ఒకటే రాజధాని అని చంద్రబాబు అంటున్నారు. ఇది తగదు మళ్లీ ఓ యాభై ఏళ్లు మేం వెనక్కు పోవాల్సి వస్తుంది. మీరు అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటే మేం యాభై ఏళ్లు వెనక్కు పోవడం ఖాయం. మా ప్రాంతానికి వచ్చి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓ ప్రాంత ప్రయోజనం కోసం నేను మాట్లాడుతున్నాను. కానీ అమరావతి అన్నది కొందరు క్యాపిటలిస్టుల కోసం ఏర్పాటు చేస్తున్నది .
- ఇది తిరుగుబాటు గడ్డ. ఆకలి, కన్నీళ్లు చూసిన గడ్డ. నేను మాట్లాడకపోయినా, ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మిగతా వారెవ్వరయినా మాట్లాడతారు. ఈ కాంటెక్స్ట్ ను మీరు గుర్తించుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా యాక్సెప్ట్ చేసిన మోడల్ డీ సెంట్రలైజ్డ్ మోడల్. మీరు మళ్లీ ఒకే రాజధాని అని అమరావతి కోసం నిధులు వెచ్చిస్తాం అంటే మేం క్లైమ్ చేస్తాం. ఒక యాభై ఏళ్లు మళ్లీ వెనక్కు పోతాం. ఓ రాజకీయ పార్టీగా మా ఆవేదన ను అర్ధం చేసుకోండి. నిజాయితీ అయిన రాజకీయాలకు మద్దతు ఇవ్వండి అని కోరాం. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల్లో ప్రతిబింబించిన ఫలితాలు కూడా అదే ! మీరు ఆ విధంగా విన్నవించడం లో తప్పు లేదు.
బాబు గురించి తెహల్కా ఏం చెప్పింది?
మీరు ఎవరితో కలిసి ప్రయాణించాలనుకుంటున్నారు. ఎవరి వైపు నిలబడి మీరు ఆ రిక్వెస్ట్ చేస్తున్నారు? చంద్రబాబు గురించి మీకున్న అభిప్రాయం చెప్పండి. 19 ఏళ్ల కిందట ఆయన ఎలాంటి వారు అన్నది తెహల్కా డాట్ కామ్ చెప్పింది. మీరు కూడా ఆయనతో కొన్నాళ్లు ప్రయాణించారు. మీకు కూడా ఆయన గురించి తెలిసే ఉంటుంది. ఉత్తమ సాహిత్యం చదివేం అని చెప్పేవారు ఎంత నిదానంగా ఉండాలి. మీరు సహనంను కోల్పోయారు. ప్రసంగంలో భాగంగా ఇష్టాను సారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఓ రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చా. కొద్ది మంది ధనవంతుల వైపు పనిచేసిన చంద్రబాబుకు మీరు మద్దతు ఇస్తున్నారు. కోట్లాది మంది పేదల కన్నీళ్లు తుడిచిన జగన్ గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నా రు. ఇవాళ విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యం ఏంటన్నది చూడండి. నడుస్తున్న ప్రభుత్వ స్కూళ్లూ గమనించండి.
ఏ సైనికుడి భూమిని కబ్జా చేశానో చెప్పగలరా?
"విశాఖలో భూములు అమ్మేశారు. నేను సైనికుల భూమిని కబ్జా చేశాను" అని అంటున్నారు. ఏమంటే ఈనాడు పేపర్లో రాశారు అంటారు. ఒక సైనికుడికి ఓ ఎసైన్డ్ భూమి ఇస్తే .. పదేళ్ల తరువాత ఆ భూమి ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఆ భూమిని బలవంతంగా తీసుకుంటే.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రెవెన్యూ మినిస్టర్ కు భూములు కేటాయించే నిర్ణయాధికారం లేదు. ఏ సైనికుడి భూమిని నేను(ధర్మాన) కబ్జా చేశానని చెప్పగలరా ?
- రామోజీ చెబితే చెప్పేస్తారా.. చంద్రబాబు చెబితే చెప్పేస్తారా ? సమాజం కోసం గళమెత్తిన వారి గొంతులు నలిపేస్తాం అంటే ఒప్పుకోను. జగన్ గారిపై నోటికొచ్చిన కామెంట్లు చేశారు. ఏ వర్గాల వైపు ఆయన ఉన్నారో చూశారా.. ఎన్ని వర్గాల ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించారో చూశారా ? ఇవాళ విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆరోగ్యానికి
ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. పేదలకు అందే ప్రజా వైద్యం కోసం చేస్తున్న ప్రయత్నం చేయండి. మీరు టీడీపీకి మద్దతు ఇవ్వడం అన్నది మీ గౌరవాన్ని పెంచేదా ? ఓ కళాకారుడిగా మీరంటే మాకు గౌరవం ఉంది.
- మీరు రాజకీయ పార్టీ పెట్టడంపై గౌరవం ఉంది. కానీ పార్టీ పెట్టి నడుచుకుంటున్న వైనంపై విభేదం ఉంది. మాట్లాడే ముందు, ఓ వ్యక్తి పై ఆరోపణలు చేసే ముందు పొంతన లేని మాటలు చెప్పడం భావ్యం కాదు. మేం అమరావతిని రాజధానిగా చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే.. మేం అంగీకరించం. ఎందుకు మరో యాభై ఏళ్లు మీరు రెవెన్యూ అంతా అక్కడే పెడతారు. అప్పుడు మళ్లీ ఉత్తరాంధ్ర వెనుకబడి ఉంటుంది. ఉత్తరాంధ్ర ప్రజల రాజకీయ ప్రయోజనాలు, వారి స్థితి గతులు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడతున్నాను.
- భావనపాడు పోర్టు కోసం ఇప్పటికే భూ సేకరణ చేశాం. అదేవిధంగా మరికొన్ని అభివృద్థి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం. భూముల తాకట్టు పెట్టి ఏం చేశారు ? జగన్ మోహన్ రెడ్డి గారు పట్టుకు పోయారా ? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడడం లేదు అని అంటున్నా రు. కానీ ఇది కేంద్ర ప్రభుత్వం పాలసీ. ఇప్పటికే ఎన్నో సార్లు కేంద్ర పెద్దలను కలిసి విన్నవించి ఉన్నాం. దీనిపై పోరాడుతూనే ఉంటాం అని మంత్రి ధర్మాన తెలిపారు.