వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అర్హులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరేలా సీఎం వైయస్ జగన్ నిర్ణయం
07 Nov 2020 3:02 PM
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
‘వైయస్సార్ కాపు నేస్తం’ రెండో విడత ప్రారంభం
విజయవాడ: అర్హులను ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. కులాల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టి కాపులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. శనివారం ‘వైయస్సార్ కాపు నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ కాపు నేస్తం పథకం ద్వారా కాపుల్లో వెనుకబడిన వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమంటే కేసులు పెట్టి కాపు ఉద్యమకారులను చంద్రబాబు జైళ్లలోకి నెట్టారని మండిపడ్డారు. పేదలు ఎవరూ పేదరికంలో మగ్గిపోకూడదని సంక్షేమ పథకాల సంస్కరణలను సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారు. కాపు నేస్తం పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. కాపులను బీసీల్లో చేరుస్తామని సాధ్యం కాని హామీలు ఇచ్చి చంద్రబాబు కాపులను మోసం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలను నాడు వైయస్జగన్ ఇవ్వలేదు. స్వార్థం కోసం పథకాలను చంద్రబాబు అమలు చేశారు. రూ.5548 కోట్లు ప్రత్యక్ష లబ్ధిదారులకు అందేలా కాపు నేస్తం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. దేవతలు యజ్ఞం తలపెడితే రాక్షసులు అడ్డుపడినట్లు రాష్ట్రంలో చంద్రబాబు అడ్డుపడుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు.
చంద్రబాబు మోసం చేశారు..:జక్కంపూడి రాజా
కాపులను బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు మోసం చేశారని జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. 5 వేల కోట్లు కాపులకు కేటాయిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు విస్మరించారని, అమలు చేయమంటే కేసులు పెట్టి జైళ్లలో పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి 2 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని ఆయన తెలిపారు.