మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సెప్టెంబర్ మొదటి వారం నుంచి కొత్త ఇసుక విధానం
29 Jul 2019 10:55 AM
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
అమరావతి: సెప్టెంబర్ మొదటి వారంలో కొత్త ఇసుక విధానం అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ యధేచ్ఛగా జరిగిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుకను దోచేయడంతో లభ్యత తక్కువగా ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న అధికారులపై గత ప్రభుత్వ ఎమ్మెల్యేలు దాడులు చేశారని తెలిపారు. గతంలో స్టాక్ పెట్టాల్సిన స్థానంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ఇసుక వేలంలో కొంత అంతరాయం ఏర్పడిందని, ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఎవరైనా బోనఫైడ్ బిల్డర్, సొంత ఇళ్లు, ప్రభుత్వ భవనాలు కట్టేవారు తహశీల్దార్ వద్దకు వెళ్తే బోనఫైడ్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. వచ్చే నెల నుంచి సిస్టమాటిక్గా, పద్ధతిగా ఇసుకను సరఫరా చేస్తామని సమాధానం చెప్పారు.అన్ని విధాల ఇసుక అందుబాటులో ఉంటుందన్నారు.